ఉక్కు పరిరక్షణకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధం
ABN , First Publish Date - 2021-10-19T06:07:33+05:30 IST
ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తున్నట్టు ప్రకటన వచ్చేవరకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు.
![ఉక్కు పరిరక్షణకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921101912353753/10192021003612n11.jpg)
పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, అక్టోబరు 18: ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తున్నట్టు ప్రకటన వచ్చేవరకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 249వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మికులు ఉద్యమం చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం నిర్వహించ తలపెట్టిన 25 గంటల దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ శిబిరంలో పలువురు ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.