ఏయూలో డిఫెన్స్ స్టడీస్కు రావత్ ప్రోత్సాహం
ABN , First Publish Date - 2021-12-09T06:12:18+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్) ఏర్పాటు వెనుక నాడు ఆర్మీ చీఫ్గా వున్న బిపిన్ రావత్ ప్రోత్సాహం ఎంతో వుందని పలువురు అధికారులు గుర్తుచేసుకుంటున్నారు.

విశాఖపట్నం, డిసెంబరు 8: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్) ఏర్పాటు వెనుక నాడు ఆర్మీ చీఫ్గా వున్న బిపిన్ రావత్ ప్రోత్సాహం ఎంతో వుందని పలువురు అధికారులు గుర్తుచేసుకుంటున్నారు. 2018లో ఢిల్లీలోని సేనా భవన్లో రావత్ను అప్పటి ఏయూ ఉప కులపతి నాగేశ్వరరావు, ఇతర అధికారులు కలిశారు. త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఏటా వెయ్యి మందికి పైగా ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బంది ప్రత్యేక కోర్సులు నేర్చుకునేందుకు అవకాశం వుందని తెలుసుకున్న బిపిన్ రావత్ ఎంతగానో ఆనందించారని ఆనాటి సంగతులను అధికారులు మననం చేసుకున్నారు. ప్రస్తుతం కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) చీఫ్గా వున్న రావత్ బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.