మరో 74 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-08-11T05:24:09+05:30 IST
జిల్లాలో మంగళవారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి.
![మరో 74 కరోనా కేసులు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081011522544/08102021235325n93.jpg)
విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,53,842కు చేరింది. ఇందులో 1,51,363 మంది కోలుకున్నారు. మరో 1,419 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్తో ఇప్పటివరకు 1,060 మంది మృతిచెందారు.