కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ చేయాలి

ABN , First Publish Date - 2021-10-21T06:03:48+05:30 IST

ఉక్కు కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ చేయాలని ఇంటక్‌ ఉప ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు కోరారు. వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ప్లాంట్‌లో నినాదాలు చేశారు.

కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ చేయాలి
నినాదాలు చేస్తున్న ఉక్కు ఇంటక్‌ నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 20: ఉక్కు కార్మికులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ చేయాలని ఇంటక్‌ ఉప ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు కోరారు. వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ప్లాంట్‌లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వేతన ఒప్పందం కాలపరిమితి పూర్తయి ఐదు సంవత్సరాలు అవుతున్నదని, కానీ నేటివరకు వేతన సవరణ చేయలేదని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జరగనున్న ఎన్‌జేసీఎస్‌ సమావేశంలో కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎంకే నాయక్‌, ఎండీ రఫౠ, గొందేశి ప్రభాకర్‌రెడ్డి, డి.మోహన్‌, ఎ.రాజేశ్వరరావు, మింది దేముడు, గంగవరం గోపి, కృష్ణ, మహాలక్ష్మి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:03:48+05:30 IST