అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-11-23T06:20:11+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న క్రమంలో సోమవారం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
![అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/192111231248223/11232021004850n82.jpg)
టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్
గాజువాక, నవంబరు 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న క్రమంలో సోమవారం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బాబాయ్ వివేకా హత్య కేసు, భువనేశ్వరిపై అనుచిత వాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ సరికొత్త డ్రామా అని ప్రజల్లో అనుమానం కలుగుతున్నదన్నారు. టీడీపీ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి ఉసురు తగలకముందే రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్బాబు, నాయకులు శ్రీనివాసవర్మ, మొల్లి పెంటిరాజు, బలగ బాలునాయుడు, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.