ధరల పెరుగుదలపై ఐద్వా నిరసన

ABN , First Publish Date - 2021-09-04T04:49:35+05:30 IST

నిత్యావసర సరకులతో పా టు వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజి ల్‌ ధరలను తగ్గించాలని డి మాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వ ర్యంలో శుక్రవారం దేశపాత్రునిపాలెంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు కె.శారద, కె.వేణు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలను పెంచుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు.

ధరల పెరుగుదలపై ఐద్వా నిరసన
నిరసన తెలుపుతున్న మహిళలు

పరవాడ, సెప్టెంబరు 3: నిత్యావసర సరకులతో పా టు వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజి ల్‌ ధరలను తగ్గించాలని డి మాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వ ర్యంలో శుక్రవారం దేశపాత్రునిపాలెంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు కె.శారద, కె.వేణు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలను పెంచుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయన్నారు. ఒక పక్క కరోనా, మరో పక్క నిత్యావసర ధరలతో  ప్రజలు ఆర్థికంగా సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు పి.మాణిక్యం, సంతోషి, రమణమ్మ, ఉమా, లక్ష్మి, జ్యోతి, రాణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-04T04:49:35+05:30 IST