ఉక్కు డైరెక్టర్కు ఓఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు
ABN , First Publish Date - 2021-12-30T05:53:38+05:30 IST
విశాఖ స్టీల్ప్లాంట్ డైరెక్టర్(కమర్షియల్) దేబ్ కల్యాణ్ మహంతి ఒడిశా మినరల్ డెవలెప్మెంట్ కంపెనీ(ఓఎండీసీ) ఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు

ఉక్కుటౌన్షిప్, డిసెంబరు 29: విశాఖ స్టీల్ప్లాంట్ డైరెక్టర్(కమర్షియల్) దేబ్ కల్యాణ్ మహంతి ఒడిశా మినరల్ డెవలెప్మెంట్ కంపెనీ(ఓఎండీసీ) ఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు భారత ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఆశీష్శర్మ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అదేవిధంగా వచ్చే ఏడాది జనవరి 24నుంచి ఓఎండీసీ డైరెక్టర్(పీఅండ్పీ)గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.