సందడిగా అమ్మవారి ఘటాల ఊరేగింపు
ABN , First Publish Date - 2021-03-22T05:49:04+05:30 IST
స్థానిక గవరపాలెంలో ఆదివారం నూకాంబిక అమ్మ వారి 101 ఘటాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.
![సందడిగా అమ్మవారి ఘటాల ఊరేగింపు](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032212180382/03222021001824n38.jpg)
అనకాపల్లిటౌన్, మార్చి 21: స్థానిక గవరపాలెంలో ఆదివారం నూకాంబిక అమ్మ వారి 101 ఘటాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. రైతు సంఘం వీధికి చెందిన భక్తుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ పండగకు వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ సతీ సమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో 81వ వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు, పీవీ రాజేశ్వర రావు, కర్రి సతీష్, కొణతాల సందీప్, పి.మురళీ తదితరులు పాల్గొన్నారు.