98వసారి రక్తదానం
ABN , First Publish Date - 2021-01-13T04:33:01+05:30 IST
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్లో మంగళవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. బీవీకే కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులు పిళ్లా వెంకటరమణమూర్తి 98వ సారి రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

సీతంపేట, జనవరి 12: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్లో మంగళవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. బీవీకే కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులు పిళ్లా వెంకటరమణమూర్తి 98వ సారి రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. కార్యక్రమంలో డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ప్రసాద్, జీఎస్ రాజు, పీఎల్కే మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహేష్, తిరుపతిరావు, రూప, అనిత, కిశోర్ పాల్గొన్నారు.