ఒడిశాకు 16 ఆర్టీసీ సర్వీసులు
ABN , First Publish Date - 2021-08-03T06:05:11+05:30 IST
ఒడిశాలోని పలు ప్రాంతాలకు బుధవారం నుంచి 16 బస్సులు నడిపేందుకు ప్రజా రవాణాశాఖ(పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది.
ద్వారకాబస్స్టేషన్, ఆగస్టు 2: ఒడిశాలోని పలు ప్రాంతాలకు బుధవారం నుంచి 16 బస్సులు నడిపేందుకు ప్రజా రవాణాశాఖ(పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు బస్సులను సిద్ధం చేసింది. కొవిడ్-19 ఉధృతి కారణంగా ఈ ఏడాది మే 5 నుంచి బస్సులను నిలిపి వేశారు. అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతో విశాఖ నుంచి జయపూర్కు 4, ఇంద్రావతికి 2, దామంజోడికి 2, ఒనకఢిల్లీకి 1, నవరంగపూర్కు 2, పర్లాకిమిడికి 3, గుణుపూర్కు 1, రాయగడకు 1 చొప్పున బస్సులు నడపనున్నారు.