1200 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-07-28T05:58:34+05:30 IST
పట్టణంలోని బస్టాండ్ జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో పోలీసులకు మినీ వ్యానులో తరలిస్తున్న 12 వందల కిలోల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.
ఎలమంచిలి, జూలై 27: పట్టణంలోని బస్టాండ్ జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో పోలీసులకు మినీ వ్యానులో తరలిస్తున్న 12 వందల కిలోల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. వ్యానుతో పాటు ఎస్.రాయవరం మండలం సైతారుపేటకు చెందిన నరసింగరావును అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ నీలకంఠరావు తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన బియ్యాన్ని తహసీల్దార్ కార్యాల యానికి తరలించామన్నారు. పూర్తి వివరాలు విచారణలో తేలనున్నట్టు చెప్పారు.