ప్రతి సెంటుకీ సాగునీరందిస్తాం
ABN , First Publish Date - 2021-09-18T05:37:23+05:30 IST
ప్రతి సెంటుకీ సాగునీరందిస్తాం
- స్పీకర్ తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: జిల్లాలో ప్రతి సెంటు భూమికి కూడా సాగునీరు అందిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. శుక్రవారం ఆర్అండ్బీ వసతి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొగరాంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటె క్నిక్ కళాశాల, పొందూరులో డిగ్రీ కళాశాల, ఆమదాలవలసలో ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఏర్పాటుతో పాటు వంశధార హైలెవల్ కెనాల్, నారయణ పురం, నాగావళి అనుసంధాన ప్రాజెక్టు, ఆమదాలవలస పట్టణ ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్పుచేసేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆఫ్షోర్ రిజర్వాయర్, నేరడి బ్యారేజీలకు త్వరలో క్లియరెన్స్ రానుందన్నారు. వంశధార-బహుదా నదుల అనుసంధానంతో జిల్లాలో ప్రతి సెంటుకీ సాగునీరు అందుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.