హిందీ పండిట్లకు వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-05-18T04:51:46+05:30 IST

హిందీ పండిట్లకు వేతనాలు చెల్లించాలని ఎస్‌ఎల్‌టీఏ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు కోరారు. సోమవారం కలెక్టర్‌ నివాస్‌కు వినతిపత్రం అందించారు. 2019 జూలైలో నియమితులైన 39 మంది హిందీ పండిట్లకు ఇంతవరకూ వేతనాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో జిల్లాను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. జీతం తీసుకోకుండానే బత్తిన రమణయ్య అనే హిందీ పండిట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

హిందీ పండిట్లకు వేతనాలు చెల్లించాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం




గుజరాతీపేట: హిందీ పండిట్లకు వేతనాలు చెల్లించాలని ఎస్‌ఎల్‌టీఏ జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు కోరారు. సోమవారం కలెక్టర్‌ నివాస్‌కు వినతిపత్రం అందించారు. 2019 జూలైలో నియమితులైన 39 మంది హిందీ పండిట్లకు ఇంతవరకూ వేతనాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో జిల్లాను సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. జీతం తీసుకోకుండానే బత్తిన రమణయ్య అనే హిందీ పండిట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. 



Updated Date - 2021-05-18T04:51:46+05:30 IST