యూబీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-08-26T05:10:23+05:30 IST
బంటుపల్లి యూబీ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు సీహెచ్ అమ్మన్నాయుడు కోరారు.

రణస్థలం: బంటుపల్లి యూబీ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు సీహెచ్ అమ్మన్నాయుడు కోరారు. ఇక్కడ చేపడుతున్న కార్మికుల దీక్షలు బుధవారానికి 65 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పూర్తి పనిదినాలు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని కోరారు.