ఘనంగా మృత్యుంజయ హోమం
ABN , First Publish Date - 2021-05-17T04:20:05+05:30 IST
ఘనంగా మృత్యుంజయ హోమం
గుజరాతీపేట: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మహామృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు. మహాసౌర హోమం, శత రుద్రయ పారాయణం కూడా జరిపించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నట్లు ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు. కార్యక్ర మంలో ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ పాల్గొన్నారు.