తల్లికి తలకొరివి పెట్టిన కుమార్తె
ABN , First Publish Date - 2021-05-17T04:22:56+05:30 IST
తల్లికి తలకొరివి పెట్టిన కుమార్తె
ఇచ్ఛాపురం: ఓ తల్లికి కుమార్తె తలకొరివి పెట్టిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెం దిన సుగ్గు సరోజినమ్మ (67) అనారోగ్యంతో సీహెచ్సీలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఆమెకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కుమా రులు లేరు. ఐదుగురికీ వివా హాలు కాగా నలుగురు కుమా ర్తెలు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సరోజినమ్మ తన చిన్నకుమార్తె గిన్ని ఉమాతో కలిసి ఉంటోంది. ఉమా భర్త వలస కార్మికుడు. ఆదివారం సాయంత్రం సరోజినమ్మ మృతిచెందింది. దీంతో రోటరీ వాహనంలో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిం చగా తల్లికి కుమార్తె తలకొరివి పెట్టింది.