వంశధారలో పడవ ప్రయాణం ప్రారంభం
ABN , First Publish Date - 2021-07-22T05:34:15+05:30 IST
నేరడి వద్ద వంశధార నదిలో పడవ ప్రయాణం ప్రారంభమయ్యింది.
భామిని: నేరడి వద్ద వంశధార నదిలో పడవ ప్రయాణం ప్రారంభమయ్యింది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటిమట్టం పెరుగుతోంది.దీంతో నేరడి, గురండి, బిల్లమడ, వడ్డంగి తదితర గ్రామస్థులు పలుపనులకు ఒడిశా వెళ్లేం దుకు నది దాటాల్సి ఉంది. ఏటా జూలై నుంచి అక్టోబరు వరకు పడవపై రాకపోకలు సాగిస్తుంటారు.