రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-10-19T05:12:34+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట పొలాలు నీటిలో మునిగి కుళ్లిపోయాయని, నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, మత్స్యకార నాయకుడు సూరాడ ధనరాజ్‌ కోరారు. ఈ మేరకు సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ఆయన స్వగ్రామం నిమ్మాడలో కలిసి వినతిపత్రం అందించారు.

రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండి
అచ్చెన్నాయుడుకి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

సంతబొమ్మాళి/కోటబొమ్మాళి, అక్టోబరు 18: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట పొలాలు నీటిలో మునిగి కుళ్లిపోయాయని, నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, మత్స్యకార నాయకుడు సూరాడ ధనరాజ్‌ కోరారు. ఈ మేరకు సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ఆయన స్వగ్రామం నిమ్మాడలో కలిసి వినతిపత్రం అందించారు. భారీ వర్షాలకు బోరు భద్ర, కొల్లిపాడు, మేఘవరం, మరువాడ, మేఘవరం లింగూడు పంచాయతీల్లో సుమారు 1000 ఎకరాల్లో పంట నీట మునిగిపోయి పాడైందన్నారు. వేటలేక మత్స్యకారులు పస్తులు ఉన్నారని, మత్స్యకారుల భృతి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పలు గ్రామాలకు చెందిన నేతలు, యువత ఆయనను కలిసి సమస్యలను వివరించారు. పంట నష్టాలపై మేఘవరం మాజీ సర్పంచ్‌ పరపటి రాజశేఖర్‌ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. 

  

Updated Date - 2021-10-19T05:12:34+05:30 IST