వరండాలో భోజనం చేస్తుండగా!
ABN , First Publish Date - 2021-09-19T05:25:22+05:30 IST
వరండాలో భోజనం చేస్తుండగా!
శ్లాబు కూలి వ్యక్తి దుర్మరణం
ముక్తుంపురంలో ఘటన
రణస్థలం, సెప్టెంబరు 18: ఆరుబయట వరండాలో భోజనం చేస్తున్న వ్యక్తిపై శ్లాబు కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన ముక్తుంపురంలో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించి జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముక్తుంపురం గ్రామానికి చెందిన కె.కొండయ్య (55) శనివారం ఉదయం వరండాలో భోజనం చేస్తున్నాడు. ఒక్కసారిగా శ్లాబు కూలిపోయి అతడిపై పడడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. హఠాత్ పరిణామంతో కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా..అప్పటికే కొండయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహం వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు. పదేళ్ల కిందట ఇంటి నిర్మాణం చేపట్టినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. జేఆర్ పురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.