నిజాయితీగా సేవలందించండి

ABN , First Publish Date - 2021-10-30T05:12:20+05:30 IST

నిజాయితీగా సేవలందించండి

నిజాయితీగా సేవలందించండి
రికార్డులను పరిశీలిస్తున్న డీఐజీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : పోలీసులు నిజాయితీగా, నిస్వా ర్థంగా సేవలందించాలని  విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగా రావు ఆదేశించారు. శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాల యాన్ని ఆయన తనిఖీ చేశారు.  పోలీసు అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఇటు ఉద్యోగాన్ని, అటు కుటుంబాన్ని సమన్వయం చేసుకుం టూ విధులు నిర్వహించాలన్నారు. నేరరహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దాలన్నారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌, అదనపు ఎస్పీలు సోమశేఖర్‌, విఠలేశ్వరరావు, డీఎస్పీలు వీరకుమార్‌, శేఖర్‌, ఏవో శివరామరాజు, ఆర్‌ఐలు ప్రదీప్‌, ఉమామహేశ్వరరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:12:20+05:30 IST