ఆర్టీసీకి దసరా ఆదాయం రూ.36 లక్షలు: ఆర్‌ఎం

ABN , First Publish Date - 2021-10-21T05:26:03+05:30 IST

దసరాకు అదనంగా బస్సులు వేయడంతో రూ.36 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ జిల్లా రీజినల్‌ మేనేజర్‌ టి.వెంకటరామం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీకి దసరా ఆదాయం రూ.36 లక్షలు: ఆర్‌ఎం


కర్నూలు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): దసరాకు అదనంగా బస్సులు వేయడంతో రూ.36 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ జిల్లా రీజినల్‌ మేనేజర్‌ టి.వెంకటరామం బుధవారం ఓ ప్రకటనలో  తెలిపారు. దసరా పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, చెన్నై నగరాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 129 ప్రత్యేక బస్సులు నడిపామని, వాటి ద్వారా మొత్తం రూ.36,93,299 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.


 రెం

Updated Date - 2021-10-21T05:26:03+05:30 IST