సిక్కోలు అభివృద్ధిలో ఎర్రన్నాయుడిది చెరగని ముద్ర
ABN , First Publish Date - 2021-11-03T05:12:26+05:30 IST
జిల్లా అభివృద్ధిలో దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుది చెరగని ముద్ర అని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంతో పాటు వివిధ చోట్ల ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
![సిక్కోలు అభివృద్ధిలో ఎర్రన్నాయుడిది చెరగని ముద్ర](https://media.andhrajyothy.com/appimg/galleries/192111021141101/11022021234137n27.gif)
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: జిల్లా అభివృద్ధిలో దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుది చెరగని ముద్ర అని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంతో పాటు వివిధ చోట్ల ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎర్రన్న కుమార్తె, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.