‘తితలీ’ పరిహారం అందించండి
ABN , First Publish Date - 2021-04-11T05:11:26+05:30 IST
తితలీ తుఫాన్తో నష్టపోయిన ఉద్దానం బాధిత రైతులకు సీఎం జగన్ పెంచిన పరిహారాన్ని తక్షణమే అందజేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్చేశారు.
హరిపురం : తితలీ తుఫాన్తో నష్టపోయిన ఉద్దానం బాధిత రైతులకు సీఎం జగన్ పెంచిన పరిహారాన్ని తక్షణమే అందజేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్చేశారు. శనివారం మందస మండలంలోని హరిపురంలోని మార్పు ట్రస్టు భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పరిహారం రెట్టింపు చేసి రెండున్నరేళ్లు గడిచాయని, పరిహారం కింద రూ.90 కోట్లు విడుదలచేసినట్లు జీవో ఇచ్చి ఏడాది గడిచినా నేటికీ అందలేదన్నారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం మండ లాధ్యక్షులు మామిడి భీమారావు, బైరి కూర్మారావు పాల్గొన్నారు.