ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు కావాలి

ABN , First Publish Date - 2021-01-13T05:22:19+05:30 IST

ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని మేఘాలయ రాష్ట్ర ఐఏఎస్‌ అధికారి సాధు శిబి చక్రవర్తి అన్నారు. మంగళవారం జమ్ము గ్రామంలో జమ్ము జనజాగృతి, జమ్ము యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు, గర్భిణుల ప్రసవ సమయాల్లో రక్తం దొరక్క ఎంతోమంతి మృతిచెందుతున్నారని, అందువల్ల రక్తదానం చేయడం వల్ల వారిని కాపాడినవారవుతారన్నారు.

ప్రతి ఒక్కరూ ప్రాణదాతలు కావాలి
రక్తదానం చేస్తున్న ఐఏఎస్‌ అధికారి సాధు శిబిచక్రవర్తి


 రక్తదానం చేసిన  ఐఎఎస్‌ అధికారి సాధు శిబిచక్రవర్తి 

జమ్ము (నరసన్నపేట) జనవరి 12: ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని  మేఘాలయ రాష్ట్ర ఐఏఎస్‌ అధికారి సాధు శిబి చక్రవర్తి అన్నారు. మంగళవారం జమ్ము గ్రామంలో జమ్ము జనజాగృతి, జమ్ము యువజన సంఘం  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు, గర్భిణుల ప్రసవ సమయాల్లో రక్తం దొరక్క ఎంతోమంతి మృతిచెందుతున్నారని, అందువల్ల రక్తదానం చేయడం వల్ల వారిని కాపాడినవారవుతారన్నారు. అనంతరం ఆయన స్వయంగా రక్తదానం చేసి యువతలో స్ఫూర్తినింపారు. 50 మంది యువత రక్తదానం చేయగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు రక్తదాతలను అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సభ్యులు చైతన్య కుమార్‌, యోగా రామారావు,  జమ్ము జన జాగృతి సభ్యులు సతీష్‌, కోటిబాబు, శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-01-13T05:22:19+05:30 IST