ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గ
ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST
ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గను తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 10, 12 వార్డుల్లో పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు ర్యాలీ నిర్వహించారు.
మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
పలాస, జూన్ 21: ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గను తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 10, 12 వార్డుల్లో పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాశీగుండం, జక్కరగుండం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైర్మన్ బళ్ల గిరిబాబు మాట్లాడుతూ చెత్తరహిత మునిసిపాలిటీగా తీర్చిదిద్ద డానికి ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఎస్.గీత, పోతనపల్లి ఉమాకుమారి వార్డుల్లో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ డి.రాజగోపాలరావు, వైస్చైర్మన్ బోర కృష్ణారావురెడ్డి, కోట్ని దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.