ప్రముఖ కథారచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత
ABN , First Publish Date - 2021-06-04T17:35:26+05:30 IST
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. జిల్లాలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు.
శ్రీకాకుళం: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. జిల్లాలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం 8:20 గంటలకు రామారావు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్ను కారా మాష్టారు అందుకున్నారు. 1996లో కారా మాస్టారు సాహిత్య అవార్డును అందుకున్నారు. కొంతకాలంగా వయోభారంతో ఇంట్లోనే ఉన్న కారా మాష్టారు ఈరోజు కన్నుమూశారు. రామారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
కారా మాష్టారు మృతిపట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన ' కారా ' చిరస్మరణీయులన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాష్టారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్నిగడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని కృష్ణదాస్ చెప్పారు.