ఓటు హక్కు కల్పించండి సారూ..!
ABN , First Publish Date - 2021-02-02T05:05:42+05:30 IST
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నాం.. ఇప్పుడు ఓటు లేదంటున్నారని పేర్కొంటూ పలువురు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 1: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నాం.. ఇప్పుడు ఓటు లేదంటున్నారని పేర్కొంటూ పలువురు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సోమవారం సమీక్ష సమావేశానికి వచ్చిన ఎస్ఈసీ రమేష్కుమార్కు కనిపించేలా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నరసన్నపేటకు చెందిన కొందరు నిరసన చేపట్టారు.