ఆసుపత్రుల్లో ‘నాడు-నేడు’తో సౌకర్యాలు
ABN , First Publish Date - 2021-05-31T05:05:16+05:30 IST
ఆసుపత్రుల్లో నాడు-నేడు పథకం ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్యాధికారులను నియమిస్తున్నామని మంత్రి అప్పల రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షే మానికి పాటుపడుతున్నట్లు తెలిపారు.
![ఆసుపత్రుల్లో ‘నాడు-నేడు’తో సౌకర్యాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మంత్రి అప్పలరాజు
పలాస: ఆసుపత్రుల్లో నాడు-నేడు పథకం ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్యాధికారులను నియమిస్తున్నామని మంత్రి అప్పల రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షే మానికి పాటుపడుతున్నట్లు తెలిపారు. రూ.1.31 లక్షల కోట్ల ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేసి నట్లు చెప్పా రు. గత ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధిని పట్టించు కోలేదని, వారి కార్య కర్తల అభివృద్ధి కోసమే పాటుపడ్డాయని తెలిపారు. తమ ప్రభు త్వం ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తోందని చెప్పారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పీవీ సతీష్ పాల్గొన్నారు. వైసీపీ కార్యా లయంలో ఆదివారం ప్రభుత్వ రెండేళ్ల సంబరాలను నిర్వహించారు. మంత్రి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.