ప్రమాద ప్రాంతాల పరిశీలన
ABN , First Publish Date - 2021-02-26T04:04:20+05:30 IST
తీయ రహదారిపై ప్రమాదకర స్థలాలను గుర్తించారు. స్థానిక ఎస్ఐ సత్యనారా యణ హైవే భద్రతా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. మడపాం నుంచి తా
నరసన్నపేట, ఫిబ్రవరి 25: జాతీయ రహదారిపై ప్రమాదకర స్థలాలను గుర్తించారు. స్థానిక ఎస్ఐ సత్యనారా యణ హైవే భద్రతా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. మడపాం నుంచి తామరాపల్లి వరకూ తరచూ ప్రమాదాలు జరిగే స్థలాలను, యూటర్న్లు ఉండే ప్రాంతాలను గుర్తించారు. అక్కడ సూచిక బోర్డులతో పాటు రేడియం కలర్ స్టిక్కర్లను అతికించాలని ఎస్ఐ హైవే సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో హైవే సిబ్బంది ధర్మంద్రే, యువరాజ్ పాల్గొన్నారు.