హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-03-23T05:18:18+05:30 IST
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పిలుపునిచ్చారు.
![హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032211421117/03222021234610n97.gif)
కొత్తూరు, మార్చి 22: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పిలుపునిచ్చారు. ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సోమవారం ఆయన మండలంలో పర్యటించారు. కొత్తూరు రామాలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఫ రాజాం రూరల్: హిందూ ధర్మం ఎంతో గొప్పదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా సోమవారం సూర్య దుర్గ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయాలను కాపాడుకోవాలన్నారు. శారదాస్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు అర్చన చేశారు. అనంతరం అంతకాపల్లి సమీపంలోని బాలా జీ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి స్వామిని కలిసి జిల్లాలో దేవాలయాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు, ఆలయ కమిటీలు, గ్రామ యువతతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను స్వామి ఆశీర్వదించారు.