భయపడొద్దు అండగా ఉంటాం...
ABN , First Publish Date - 2021-12-05T05:20:42+05:30 IST
జవాద్ తుఫాన్ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు భయపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. ఈ మేరకు శనివారం బారువలో పర్య టించి మాట్లాడారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి సహాయం కావాలన్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణ సహాయం అందుతుందన్నారు.
జడ్పీ చైర్పర్సన్ విజయ
సోంపేట : జవాద్ తుఫాన్ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు భయపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. ఈ మేరకు శనివారం బారువలో పర్య టించి మాట్లాడారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి సహాయం కావాలన్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణ సహాయం అందుతుందన్నారు. తహసీల్దార్ సదాశివుని గురుప్రసాద్, ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నిమ్మన దాసు, జడ్పీటీసీ సభ్యురాలు తడక యశోద, సర్పంచ్ యర్ర రజని తదితరులు ఉన్నారు.