భరణికాంలో తగ్గుముఖం పట్టిన డయేరియా

ABN , First Publish Date - 2021-11-28T05:40:56+05:30 IST

గోవిందపురం పంచాయతీ భరిణికాంలో డయేరియా తగ్గుముఖం పట్టింది.

భరణికాంలో తగ్గుముఖం పట్టిన డయేరియా
రోగులకు మందులు పంపిణీ చేస్తున్న వైద్య సిబ్బంది


లావేరు: గోవిందపురం పంచాయతీ  భరిణికాంలో డయేరియా తగ్గుముఖం పట్టింది. గ్రామానికి చెం దిన ముచ్చిమని కృష్ణతో పాటు మరో ఇద్దరు వ్యక్తు లకు రెండు రోజులు కింద ట డయేరియా సోకింది. వీరు రణస్థలం సీహెచ్‌సీలో చికిత్స పొందడంతో కోలుకు న్నారు. శనివారం ఇంటికి చేరుకున్నారు. గ్రామంలో లావేరు పీహెచ్‌సీ సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. రోగులకు  మందులు పంపిణీ చేశారు. ఆర్‌డబ్లూఎస్‌ ఏఈ డి.రామారావు, సర్పంచ్‌ పిల్ల రాములు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఏఎన్‌ఎం రమణమ్మ, ఆశవర్కర్లు మరియమ్మ, లక్ష్మీనారాయణమ్మలు పాల్గొన్నారు. 





 


Updated Date - 2021-11-28T05:40:56+05:30 IST