‘ఓటిఎస్‌’తో పేదలను వంచిస్తోంది

ABN , First Publish Date - 2021-12-20T04:56:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలను వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సారవకోట మండలం మహసింగి గ్రామంలో ఆదివారం గౌరవ సభ ప్రజా సమస్యలు చర్చావేదిక నిర్వహించారు.

‘ఓటిఎస్‌’తో పేదలను వంచిస్తోంది
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

సారవకోట (జలుమూరు) డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదలను వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సారవకోట మండలం మహసింగి గ్రామంలో ఆదివారం గౌరవ సభ ప్రజా సమస్యలు చర్చావేదిక నిర్వహించారు. ప్రతీ ఏటా ఇంటిపన్ను కడుతున్న లబ్ధిదారుకు ఆ ఇంటిపై హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజానీకానికి వివరించారు. నిత్యావసర వస్తువుల నుండి పెట్రోల్‌ వరకు ధరలు పెంచారన్నారు. ఓటీఎస్‌ను ఎవరూ కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారి ఇంటిపై వారికే హక్కు కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీడీపీ బలోపేతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో  టీడీపీ మం డల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, పార్టీ  జిల్లా అధికార ప్రతినిధి సురవరపు తిరుపతిరావు,  నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-20T04:56:40+05:30 IST