కరోనా బాధితులకు సేవలందించాలి
ABN , First Publish Date - 2021-04-12T04:56:21+05:30 IST
కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలని జేసీ సుమిత్కు మార్ ఆదేశించారు. ఆదివారం పాలకొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.
పాలకొండ: కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలని జేసీ సుమిత్కు మార్ ఆదేశించారు. ఆదివారం పాలకొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. త్వరలో ఈ ఆస్పత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తామన్నారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు మందులు తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్ జె.రవీం ద్రకుమార్ను ఆదేశించారు. ఆర్డీవో టీవీఎస్జీ కుమార్, వైద్యుడు శ్రీనివాస్ ఉన్నారు.