ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
ABN , First Publish Date - 2021-02-06T05:28:28+05:30 IST
: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ జి.అప్పారావు అన్నారు.
![ప్రశాంత ఎన్నికలకు సహకరించండి](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020511563128/02052021235645n68.gif)
కవిటి : ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ జి.అప్పారావు అన్నారు. శుక్రవారం కవిటి మండలంలోని ఇద్దెవాణిపాలెంలో గ్రామస్థులతో సమా వేశం నిర్వహించారు. అనంతరం కుసుంపురం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇచ్ఛాపురం రూరల్ : పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జె.జనార్దనరావు అన్నారు. బాలకృష్ణాపురం, బిర్లంగి, ఈదుపురం, కొఠారి, మశాఖపురం, కీర్తిపురం, కవిటి మండలంలో లండారిపుట్టుగ, మాణ్యిపురం, బెలగాం, నెలవంక పంచాయతీలను సమస్యాత్మగా గ్రామాలుగా గుర్తించామన్నారు.