రేపు సీఎం రాక
ABN , First Publish Date - 2021-12-26T05:20:37+05:30 IST
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం పరిశీలించారు.
![రేపు సీఎం రాక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సురేష్
ఎర్రగొండపాలెం, డిసెంబరు 25: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం పరిశీలించారు. మంత్రి సురేష్ కుమార్తె వివా హం ఈనెల 17న హైదరాబాద్లో జరిగింది. 27న వైపాలెంలో వివాహ రిసె ప్షన్ను వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఎం హాజరవుతున్నారు. జగన్ రాక సందర్భంగా హెలిప్యాడ్, రిసెప్షన్ వేదిక, వీఐపీల భోజనాల వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లను మంత్రి సురేష్ పోలీసు అధికారులతో కలసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ కె.కిశోర్కుమార్, ఇంటెల్జెన్సు అధికారులు, ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, సీఐ పి.దేవప్రభాకర్, త్రిపురారంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, ఎర్రగొండపాలెం ఎంపీపీ డి.కిరణ్గౌడ్, తహసీల్దార్ వీరయ్య, ఎంపీడీవో సాయికుమార్, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు.