రాజాంలో సినీ సందడి
ABN , First Publish Date - 2021-12-07T05:08:21+05:30 IST
రోహిత్ కుంజాల్ ఫిల్మ్స్ బ్యానర్పై వర్ధమాన నటుడు వెంకి హీరోగా, అపర్ణ, హీనా హీరోయిన్లగా తెరకెక్కించనున్న వన్ బై ఫోర్ చిత్రం షూటింగ్ను స్థానిక తృప్తి రిసార్ట్స్లో సోమవారం ప్రారంభించారు. ఎమ్మె ల్యే కంబాల జోగులు క్లాప్ కొట్టి సినిమాకు శ్రీకారం చుట్టగా పాలవలస శ్రీనివాస రావు కెమెరా ఆన్ చేశారు.
రాజాం రూరల్: రోహిత్ కుంజాల్ ఫిల్మ్స్ బ్యానర్పై వర్ధమాన నటుడు వెంకి హీరోగా, అపర్ణ, హీనా హీరోయిన్లగా తెరకెక్కించనున్న వన్ బై ఫోర్ చిత్రం షూటింగ్ను స్థానిక తృప్తి రిసార్ట్స్లో సోమవారం ప్రారంభించారు. ఎమ్మె ల్యే కంబాల జోగులు క్లాప్ కొట్టి సినిమాకు శ్రీకారం చుట్టగా పాలవలస శ్రీనివాస రావు కెమెరా ఆన్ చేశారు. ఈ సందర్భంగా బాహు బలి కో డైరెక్టర్, చిత్ర డైరెక్టర్ కె.సుక్రన్ మాట్లా డుతూ.. పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించనున్నట్లు వివరించారు. గల్లిగల్లీ లో జరిగే యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో క్రైమ్కు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. రంజన్ కుంజాల్, రోహిత్ కుంజాల్ నిర్మాత లన్నారు. కార్యక్రమంలో తృప్తి రిసార్ట్స్ అధినేత మురళి మాస్టర్, కెప్టెన్ డీఎల్ఎన్ రాజు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.