పీహెచ్‌సీని తనిఖీ చేసిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2021-10-21T05:16:32+05:30 IST

మండల కేంద్రంలోని పీహెచ్‌సీని నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ కమిటీ(ఎన్‌క్యూఎఎస్‌) బుధవారం తనిఖీ చేసింది. కమిటీ సభ్యులు డాక్టర్‌ సుఘన్‌ సింధియా, ఈశ్వరి వైద్యసిబ్బంది హాజరు, మందులు, అభివృద్ధి తదితర రికార్డులను పరిశీలించారు.

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కేంద్ర బృందం
రికార్డులను పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు

ఎల్‌.ఎన్‌.పేట, అక్టోబరు 20: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ కమిటీ(ఎన్‌క్యూఎఎస్‌) బుధవారం తనిఖీ చేసింది. కమిటీ సభ్యులు డాక్టర్‌ సుఘన్‌ సింధియా, ఈశ్వరి వైద్యసిబ్బంది హాజరు, మందులు, అభివృద్ధి తదితర రికార్డులను పరిశీలించారు. అలాగే పీహెచ్‌సీలో ఉన్న పరికరాలు, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించి వైద్యశాఖ పనితీరుకు వన్నె తీసుకు రావాలని సూచించారు. వీరితోపాటు వైద్యాధికారి టి.ప్రవల్లిక, హెచ్‌వీ జి.పద్మావతి పాల్గొన్నారు.

   

Updated Date - 2021-10-21T05:16:32+05:30 IST