నవంబరు 1 నుంచి పీహెచ్సీల్లో బయోమెట్రిక్
ABN , First Publish Date - 2021-10-15T04:17:09+05:30 IST
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నవంబరు 1 నుంచి బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశించా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలవుతున్న కార్యక్రమాలపై జిల్లా అధికారులతో గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 14: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నవంబరు 1 నుంచి బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశించా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలవుతున్న కార్యక్రమాలపై జిల్లా అధికారులతో గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ సిబ్బంది విధులకు వచ్చినప్పుడు.. తిరిగి వెళ్లినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సిందే స్పష్టం చేశారు. బ యోమెట్రిక్ పరికరాలు లేని పీహెచ్సీల్లో తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. విధులకు హాజరుకాని సిబ్బందికి జీతం చెల్లించమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలందించాలని ఆదేశించారు. అర్హతలు, అనుభవం కలిగినవారే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటారన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాలు తక్కువగా జరుగుతున్నాయని.. ఈ పరిస్థితి మారాలన్నారు. మాతాశిశు మరణాలు సంభవించకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చంద్రనాయక్, ఏడీఎంహెచ్వో జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు.