మోటార్‌సైకిళ్ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-09-04T05:22:14+05:30 IST

తాళం వేసిన మోటార్‌సైకిళ్లను చోరీ చేసి జల్సాలు చేస్తున్న నిం దితుడిని అరెస్టు చేసి, 21 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మోటార్‌సైకిళ్ల దొంగ అరెస్టు
స్వాధీనం చేసుకున్న మోటార్‌సైకిళ్లను పరిశీలిస్తున్న ఎస్పీ మలిక గర్గ్‌

21 వాహనాల రికవరీ

వివరాలు వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 3 : తాళం వేసిన మోటార్‌సైకిళ్లను చోరీ చేసి జల్సాలు చేస్తున్న నిం దితుడిని అరెస్టు చేసి, 21 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మోటార్‌సైకిళ్లను దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న దొంగను ఎట్టకేల కు ఒంగోలు తాలుకా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీస్‌ కార్యాల యం ఆవరణలోని గెలాక్సీసమావేశం మందిరంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎ స్పీ కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని కంభం పట్టణానికి చెందిన దూదేకుల ఖలీల్‌ అలియాస్‌ గున్ను మోటార్‌సైకిళ్లను చోరీ చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్ప టి వరకు ఒంగోలు తాలుకా పరిధిలో 7, గుంటూరు జిల్లా కొత్తపేట పరిధిలో 7, ఒంగోలు వన్‌టౌన్‌లో 1, గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో 2, నగరంపాలెం పరిధిలో 1, కృష్ణలంకలో 1, మార్కాపురం పరిధిలో 1 మోటర్‌సైకిల్‌ను అపహరించినట్లు ఎస్పీ తెలిపారు.అంతేగాకుండా రాష్ట్రంలోని నంద్యాల, కర్నూలు, అనంతపురం, గిద్దలూరు, నరసరావుపేట, విజయవాడతో పాటుగా తెలంగాణలోని మహబూబునగర్‌ జిల్లా లో ఖలీల్‌పై కేసులు ఉన్నాయని చెప్పారు. ఇంకా చాలా కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు. శుక్రవారం ఉదయం ఒంగోలు నగరం ఉత్తర బైపాస్‌ రోడ్డులో తాలుకా పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా తిరుగుతున్న ఖలీల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా 21 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.11 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.   నిందితుడిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ ప్రసాద్‌, తాలుకా ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ దేవకుమార్‌, సిబ్బంది కె.సురేష్‌, కె.రామకృష్ణ, వి.శ్రీనివాసులు, కె.రవికుమార్‌లను ఎస్పీ మలికగర్గ్‌ అభినందిచారు.

Updated Date - 2021-09-04T05:22:14+05:30 IST