పురాతన నాణేల సేకరణ ముఠా పనే: సీఐ
ABN , First Publish Date - 2021-01-27T05:18:51+05:30 IST
హిరమండలం మండ లం పాత కొమ్మనాపల్లి శివాలయ శిఖర ధ్వంసం కేవలం పురాతన నాణేల సేకరణ ముఠా పనే అని సీఐ ఆర్ రవిప్రసాద్ పేర్కొన్నారు.
పాతపట్నం: హిరమండలం మండ లం పాత కొమ్మనాపల్లి శివాలయ శిఖర ధ్వంసం కేవలం పురాతన నాణేల సేకరణ ముఠా పనే అని సీఐ ఆర్ రవిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో మం గళవారం విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. గోపురాలపై ఉండే కలశాలు పురాతన నాణేల కోసం శిఖరంపై రంధ్రం చేసి చూసి అక్కడ ఏమీ లేకపోడంతో వెనుతిరిగారన్నారు. ఇదే విషయాన్ని గ్రామస్థులు కూడా ధ్రువీకరించారని చెప్పారు. ఒకవైపు కాశీవిశ్వేరఆలయం, మరోపక్క భగీరఽథ ఆలయం ఉన్నందున గోపురశిఖరంపై శూలం ఉండడం శూలానికి ప్రత్యేక శక్తులుంటాయని, కలశంలో రైస్పుల్లింగ్ నాణేలుంటాయనే భ్రమతో ఈఘటనకు పాల్పడి ఉంటారన్నారు. గ్రామస్థుల సమక్షంలోనే ఈ ఘటనలో లభించిన నాణేలను స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. ఈఘటనపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నా మన్నారు. కాగా ఇప్పటికే ఆలయశిఖరం మరమ్మతులు చేయడం జరిగిందన్నారు.
: