గోకర్ణపురం వద్ద యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2021-09-29T05:42:39+05:30 IST
: కృష్టసాగరానికి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడం, కాలువలు ఉప్పొంగడంతో గోకర్ణపురం వద్ద వంతెనపై నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి నందరకొత్తూరుకు చెందిన సవర ధనుంజయ్ మంగళవారం ద్విచక్ర వాహనంతో కొట్టుకుపోయాడు. కూరగాయల అమ్మ కానికి గ్రామానికి వస్తున్న ధనుంజయ్ ఒక్కసారి నీటి ప్రవాహానికి గురయ్యాడు. ఈ సంఘటన చూసి న స్థానికులు తక్షణం స్పందించి గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పెద్ద తాళ్లు తెచ్చి కొట్టుకుపోతున్న అతడిని కాపాడారు.
రక్షించిన గ్రామస్థులు
మెళియాపుట్టి, సెప్టెంబరు 28 : కృష్టసాగరానికి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడం, కాలువలు ఉప్పొంగడంతో గోకర్ణపురం వద్ద వంతెనపై నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి నందరకొత్తూరుకు చెందిన సవర ధనుంజయ్ మంగళవారం ద్విచక్ర వాహనంతో కొట్టుకుపోయాడు. కూరగాయల అమ్మ కానికి గ్రామానికి వస్తున్న ధనుంజయ్ ఒక్కసారి నీటి ప్రవాహానికి గురయ్యాడు. ఈ సంఘటన చూసి న స్థానికులు తక్షణం స్పందించి గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పెద్ద తాళ్లు తెచ్చి కొట్టుకుపోతున్న అతడిని కాపాడారు. ద్విచక్రవాహనం సైతం రాళ్లు అడ్డంగా ఉండడంతో కాలులలో కొట్టుకు పోకుండా ఆగింది. తక్షణం శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.