వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-06-19T07:36:30+05:30 IST
కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఆర్డీవోకు టీడీపీ నాయకుల వినతి
మార్కాపురం, జూన్ 18: కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఎం.శేషిరెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. కరోనాతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని, ప్రతి కు టుంబానికీ రూ.10 వేల సాయం అందించాలని నాయకులు కోరారు. వ్యవసాయరంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, అన్ని ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 65 లక్షల టీకా డోసులను సరఫరా చేయగా, కేవలం 26 లక్షల డోసులు మాత్రమే వినియోగించారని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొ ప్పుల శ్రీనివాసులు, కాకర్ల శ్రీనివాసులు, జవ్వాజి రామాంజనేయరెడ్డి, తాం డ్ర వెంకటేశ్వర్లు, గొట్టం శ్రీనివాసరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు.