ఒంగోలులో ఒక కేంద్రంలో వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-05-21T05:20:21+05:30 IST
ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూ లులో 45 ఏళ్ళు పైబడిన వారందరికీ కొవిషీల్డ్ మొదటి డోసు వేసే ప్రక్రియను చేపట్టారు. దీంతో టీకా వేయిం చుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఒంగోలు(కలెక్టరేట్), మే 20 : ఒంగోలులో గురువా రం నుంచి కొవిషీల్డ్ మొదటి డోసు వేసే ప్రక్రియను చే పట్టారు. ఈనెల 9వతేదీ నుంచి ఒంగోలులో కేవలం సె కండ్ డోసు టీకా మాత్రమే వేస్తున్నారు. అయితే నగరం లో మొదటి డోసు పూర్తయ్యి సెకండ్ డోసు కొ వ్యాగ్జిన్ వేయించుకోనే వారు అధికంగా ఉన్నారు. దీంతో కొవిషీ ల్డ్ సెకండ్ డోసు తక్కువగా ఉన్నారు. ఈక్రమంలో గు రువారం ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూ లులో 45 ఏళ్ళు పైబడిన వారందరికీ కొవిషీల్డ్ మొదటి డోసు వేసే ప్రక్రియను చేపట్టారు. దీంతో టీకా వేయిం చుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.