2వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ABN , First Publish Date - 2021-05-31T05:27:44+05:30 IST
మండలంలోని యర్రగుంట్ల అటవీ ప్రాంతంలో అక్రమంగా కాస్తున్న నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. 2వేల లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. అధికారులకు అందిన సమాచారం మేరకు మండలంలోని యర్రగుంట్ల గ్రామం తూర్పు అటవీ ప్రాంతంలో నాటుసారా కాస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
![2వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921053011553959/05302021235551n57.jpg)
కొమరోలు, మే 30 : మండలంలోని యర్రగుంట్ల అటవీ ప్రాంతంలో అక్రమంగా కాస్తున్న నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. 2వేల లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. అధికారులకు అందిన సమాచారం మేరకు మండలంలోని యర్రగుంట్ల గ్రామం తూర్పు అటవీ ప్రాంతంలో నాటుసారా కాస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2వేల లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. ఈ దాడిలో సీఐ సోమయ్య, ఎస్ఐ మహబూబ్వలి తదితరులు పాల్గొన్నారు.