ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించం

ABN , First Publish Date - 2021-10-22T05:29:30+05:30 IST

ఒంగోలులో టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గతంలో తాను కమ్మపాలెం పర్యటనకు వెళితే పోలీసులతో అడ్డుకు న్నది ఎవరో తెలుసన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే సంస్కృతి తనకు లేదన్నారు.

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించం



మంత్రి బాలినేని 


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 21 : ఒంగోలులో టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గతంలో తాను  కమ్మపాలెం పర్యటనకు వెళితే పోలీసులతో అడ్డుకు న్నది ఎవరో తెలుసన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే సంస్కృతి తనకు లేదన్నారు. వైసీపీ ఒంగోలు నగర కమిటీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద జనాగ్రహం దీక్షలో మంత్రి ముఖ్యఅ తిఽథిగా హాజరై మాట్లాడారు. టీడీపీ నేత పట్టాభిరామ్‌ సభ్య సమాజం తలదించుకొనే విధంగా మాట్లాడితే దానిని సమ ర్థిస్తూ చంద్రబాబునాయుడు బంద్‌కు పిలుపునివ్వడం, 36 గంటల దీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, వైసీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాను రాజశేఖర్‌, గంటా రామానాయుడు, కఠారి శంక ర్‌, అయినాబత్తిన ఘనశ్యాం, రమాదేవి, బైరెడ్డి అరుణ, త మ్మినేని మాధవి, కేవీరమణారెడ్డి, తాతా బద్రి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:29:30+05:30 IST