జిల్లాలో 6,890 మందికి టీకా
ABN , First Publish Date - 2021-03-21T06:20:13+05:30 IST
జిల్లాలో శనివారం 6,890మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.రత్నావళి ఒక ప్రకటనలో తెలిపారు.

ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 20 : జిల్లాలో శనివారం 6,890మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.రత్నావళి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 141 కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సినేషన్ చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 99,819మందికి టీకా వేయించుకున్నారని తెలిపారు. జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ శనివారం కరోనా టీకా (రెండో డోస్)ను వేయించుకున్నారు. 28రోజుల క్రితం ఆయన మొదటి డోస్ వేయించుకున్న విషయం విదితమే.