ఖైనీ గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-01-25T05:40:30+05:30 IST

దర్శి పట్టణ సమీపంలో రూ.2లక్షలు విలువచేసే ఖైనీ, గుట్కా ప్యాకేట్లను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

ఖైనీ  గుట్కా ప్యాకెట్లు పట్టివేత
స్వాదీనం చేసుకున్న ఖైనీ, గుట్కా ప్యాకేట్లు

 ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత

దర్శి, జనవరి 24 : దర్శి పట్టణ సమీపంలో రూ.2లక్షలు విలువచేసే ఖైనీ, గుట్కా ప్యాకేట్లను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఎం.భీమానాయక్‌, ఎస్సై రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు దర్శి, పొదిలి రోడ్డులో వాహనాలను తనఖీలు చేస్తుండగా బేస్తవారపేట నుంచి వస్తున్న ఆటోలో ఖైనీ, గుట్కా ప్యాకేట్లు దొరికాయి. సుమారు రూ.2లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రూ.25వేలు నగదు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

Updated Date - 2021-01-25T05:40:30+05:30 IST