ఉరేసుకుని యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-12-15T05:48:59+05:30 IST
యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘ టన ఒంగోలు నగరం నేతాజీకాలనీలో సోమవారం రాత్రి జరిగింది.

ఒంగోలు(క్రైం), డిసెంబరు 14: యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘ టన ఒంగోలు నగరం నేతాజీకాలనీలో సోమవారం రాత్రి జరిగింది. లారీ డ్రైవర్ గా పనిచేసే నక్కా మణికంఠ(30) ట్రాన్స్జండర్తో కలిసి ఉంటున్నాడు. వారు ఇరువురు సోమవారం గొడవపడ్డారు. అనంతరం ట్రాన్స్జండర్ ఇంట్లో లేని స మయంలో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ విషయాన్ని మంగళవారం ఉద యం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాలుకా ఎస్సై దేవకు మార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.