సమాచారం లేకుండా టేకు చెట్ల తొలగింపు
ABN , First Publish Date - 2021-08-26T05:01:57+05:30 IST
తన పొలంలో ఉన్న టేకు చెట ను ముందస్తు సమాచారం ఇవ్వ కుండా విద్యుత్శాఖ అధికారులు తొలగించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు.

తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన రైతు
గిద్దలూరు టౌన్, ఆగస్టు 25 : తన పొలంలో ఉన్న టేకు చెట ను ముందస్తు సమాచారం ఇవ్వ కుండా విద్యుత్శాఖ అధికారులు తొలగించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయబూ బుధవారం తహసీల్దార్ రాజారమేష్ ప్రేమ్కుమార్కు వినతిప త్రం అందించారు. మండలంలోని గడికోట పంచాయతీ పరిధిలోని దేవనగరం గ్రామంలో రైతు రామనారాయణకు చెందిన పొలంలో టేకు చెట్లను కొన్ని సంవత్సరాలుగా పెంచుతున్నారు. ముండ్లపాడు విద్యుత్శాఖ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్నాయంటూ చెట్లను నరికివేశారు. రైతుకు తెలియకుండానే పొలంలోకి వెళ్లి సుమారు రూ.2లక్షల విలువైన చెట్లను నరికివేయడంతో నష్టం జరిగిందని రైతు వాపోయాడు. పొలంలో కొర్ర పంట సాగులో ఉన్నదని, అది కూడా నష్టపోయినట్లు రైతు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నష్టపోయిన పంటకు, టేకు చెట్లకు నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.